టీమిండియా ఆటగాళ్లకు జరిమానా
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా ఆటగాళ్లకు ICC జరిమానా విధించింది. ICC నిబంధనల ప్రకారం ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 20% కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి కెప్టెన్ కోహ్లి సైతం అంగీకరించాడని తెలిపింది. ఇక ఆస్ట్రేలియా కేటాయించిన సమయంలో ఓవర్లు పూర్తి చేసిందని పేర్కొంది. నిన్న సిడ్నీలో జరిగిన మ్యాచులో INDపై ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Post a Comment