T20 ఆడనున్న శ్రీశాంత్
కేరళ క్రికెట్ సంఘం నిర్వహించే స్థానిక T20 టోర్నీలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆడనున్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ స్పీడ్ స్టర్ బంతి పట్టనున్నాడు. IPLలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో BCCI శ్రీశాంత్ పై శాశ్వత నిషేధం విధించింది. దీనిపై న్యాయపోరాటం చేసి సుప్రీం కోర్టులో విజయం సాధించాడు. సెప్టెంబర్ లో అతడిపై నిషేధం తొలగిపోయింది. దాంతో అళపులలో జరగబోయే T20 టోర్నీలో ఆడేందుకు శ్రీశాంత్ సిద్ధమయ్యాడు.
Comments
Post a Comment