సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డేలో TRS నేతలు ప్రచారం నిర్వహించారు. ఆస్ట్రేలియా TRS విభాగం ప్రతినిధులు TRS ప్లకార్డులను పట్టుకుని GHMC ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
సి రీస్ ఫలితం ఎలా వచ్చినప్పటికీ విజయం మాత్రం భారత్దే’’.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో టీమ్ఇండియా పోరాట పటిమ చూసిన తర్వాత చాలా మంది మాజీ ఆటగాళ్లు వ్యక్తపరిచిన అభిప్రాయమిది. అవును.. బలమైన ఆసీస్తో టెస్టుల్లో భారత ఆటగాళ్లు చూపిస్తున్న పోరాటం అసమానం. గాయాల కారణంగా ప్రధాన ఆటగాళ్లు దూరమైనప్పటికీ.. ద్వితీయ శ్రేణి క్రికెటర్లతో కూడిన జట్టు ప్రదర్శిస్తున్న పట్టుదల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ పోరాటానికి సరైన ఫలితం దక్కేందుకు టీమ్ఇండియాకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. చివరి టెస్టు ఆఖరి రోజు అదే తెగువ, పట్టుదల చూపి సిరీస్ను సగర్వంగా ముగించాలని జట్టు కోరుకుంటోంది. ఈ మ్యాచ్ను డ్రా చేసుకున్నా భారత్కు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే సిరీస్ 1-1తో సమంగా ఉంది కాబట్టి ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా.. చివరగా బోర్డర్-గావస్కర్ (2018-19) సిరీస్లో విజేతగా నిలిచిన భారత్ దగ్గరే ఆ ట్రోఫీ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ నెగ్గకపోతే మాత్రం ఆసీస్ పరువు కచ్చితంగా పోతుంది. ఎందుకంటే గత 31 టెస్టుల్లో తమకు పరాజయం తెలీని గబ్బా మైదానంలో.. అత్యుత్తమ ఎలెవన్ అందుబాటులో లేని భారత్తో ...
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో ఒక ఆటగాడికి యూకే కరోనా స్ట్రెయిన్ సోకిందని అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో అతడిని ప్రత్యేక క్వారంటైన్కు తరలించామని చెప్పారు. లంక జట్టుతో ఇంగ్లాండ్ నేటి నుంచి రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కన్నా ముందే ఈ సిరీస్ జరగాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. క్రికెట్ మళ్లీ మొదలయ్యాక నేటి నుంచి నిర్వహించడానికి ఇరు జట్లూ అంగీకరించాయి. ఈ క్రమంలోనే జనవరి 4న అక్కడ అడుగుపెట్టిన ఇంగ్లాండ్ ఆటగాళ్లకు కరోనా టెస్టులు చేశారు. అందులో ఆల్రౌండర్ మోయిన్ అలీకి పాజిటివ్గా తేలిందని, అది యూకే స్ట్రెయిన్గా గుర్తించామని లంక వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అయితే, శ్రీలంకలో ఇదే తొలి యూకే స్ట్రెయిన్ కేసు అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందన్న నేపథ్యంలో గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. అంతకుముందు మిగతా ఆటగాళ్లకి నెగెటివ్ రావడంతో నేటి నుంచి టెస్టు సిరీస్ యథావిధిగా కొనసాగుతందని చెప్పారు. మరోవైపు అలీతో సన్నిహితంగా ఉన్న క్రిస్వోక్స్కు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే, వోక్స్ ...
జట్టు నిండా గాయాలే. 11 మంది ఫిట్గా ఉన్న వాళ్లను సిద్ధం చేయడమే కష్టం ఉంది. దానికి తోడు క్వారంటైన్ కష్టాలు. ఆపై ఆడాల్సింది ఆస్ట్రేలియాకు అద్బుత రికార్డున్న గబ్బాలో. ఇన్ని ప్రతికూలాంశాలున్నా.. టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. క్లిష్టపరిస్థితుల్లో సిడ్నీలో అసాధారణ పోరాటంతో చేసుకున్న డ్రా స్ఫూర్తినిస్తుంటే.. ఆతిథ్య జట్టుతో నిర్ణయాత్మక నాలుగో టెస్టుకు సన్నద్ధమైంది. రేపటి నుంచే సమరం. హో రాహోరీగా సాగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్లో రసవత్తర సమరానికి వేళైంది. శుక్రవారం నుంచే భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు. సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్పై చాలా ఆసక్తి ఏర్పడింది. గత మ్యాచ్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత్ బరిలోకి దిగుతుంటే.. తమకు గొప్ప రికార్డున్న గబ్బాలో మరోసారి తమదే పైచేయి అవుతుందన్న ధీమాతో ఆతిథ్య జట్టు పోరుకు సిద్ధమైంది. మరి సిరీస్ ఎవరి సొంతమవుతుందో..! పొంచి ఉన్న వాన ఎం తో ఆసక్తిరేపుతున్న ఈ చివరి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం, సోమవారం వాన పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే వాన వల్ల రోజంతా ఆట ఏమీ తుడిచిపెట్టుకుపోవచ్చు. గబ్బా పిచ్పై బౌలర్లక...
Comments
Post a Comment