10మంది క్రికెటర్లకు కరోనా
కరోనా వైరస్ బారినపడిన పాకిస్థాన్ క్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది. న్యూజిలాండ్ టూర్ కు వచ్చిన పాక్ క్రికెటర్లకు కరోనా పరీక్షలు చేయగా, మొదట ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మరో క్రికెటర్కు కరోనా రాగా, తాజాగా మరో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 10 మంది క్రికెటర్లు కరోనా బారినపడ్డారు. దీంతో పాక్ జుట్టులో కలవరం మొదలవగా, సిరీస్ నిర్వహణపై అనుమానం నెలకొంది.
Comments
Post a Comment