భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ సిడ్నీలోనే
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలోని 3వ టెస్టు సిడ్నీలో జరగనుంది. ఈ మేరకు ఆసీస్ క్రికెట్ బోర్డు అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ మూడో టెస్టు జరుగుతుందా లేదా అని కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధత వీడింది. న్యూ ఇయర్ టెస్ట్ జనవరి 7 నుంచి11 వరకు మ్యాచ్ జరగనుంది. అడిలైడ్ లోని తొలి టెస్టులో ఆస్ట్రేలియా, మెల్ బోర్న్ లో జరిగిన రెండో టెస్టులో భారత్ గెలిచాయి.
Comments
Post a Comment