చిత్రను కొట్టి చంపేశాడు
ఇటీవల మరణించిన బుల్లితెర నటి చిత్రను భర్త హేమనాథ్ కొట్టి చంపేశాడని ఆమె తల్లి విజయ ఆరోపించింది. నిశ్చితార్థం వరకు హేమనాథ్ బాగానే ఉన్నాడని, ఆ తర్వాత అతడి నిజస్వరూపం బయటపడిందని చెప్పింది. వారిద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని.. చిత్ర ఏ విషయాన్ని తమ దృష్టికి తీసుకురాలేదంది. చిత్ర ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. హేమనాథ్ ఆమెను కొట్టి చంపేసినట్టున్నాడని, సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేసింది.
Comments
Post a Comment