ఉమేశ్ యాదవ్ కు గాయం
రెండో టెస్టులో దూకుడు మీదున్న భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. మోకాలికి దెబ్బ తగలడంతో మ్యాచ్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు. వెంటనే డ్రెస్సింగ్ రూంకు తరలించారు. గాయం తీవ్రతను వైద్యులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే షమి సేవలను కోల్పోయిన టీమిండియాకు ఇది గట్టిదెబ్బని తెలుస్తోంది.
Comments
Post a Comment