నెటిజన్లపై ఆఫ్రిది మండిపాటు
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది నెటిజన్లపై మండిపడ్డాడు. లంక ప్రీమియర్ లీగ్ నుంచి ఇటీవల తాను అకస్మాత్తుగా నిష్క్రమించడంతో నెట్టింట్లో వదంతులు వ్యాపించాయి. తన కూతురు ఆరోగ్యం బాగాలేనందునే ఆఫ్రిది ఇంటికెళ్లినట్లు వచ్చిన రూమర్లను ఆయన ఖండించాడు. ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని కోరాడు. తన కూతురు ఆరోగ్యంగా ఉందని బర్త్ డే విష్ చేస్తూ ఫొటో షేర్ చేశాడు. దేవుడి దయతో తన కుటుంబం హ్యపీగా ఉందని తెలిపాడు.
Comments
Post a Comment