కరోనా భయంతో వన్డే సిరీస్ వాయిదా
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ వాయిదా పడింది. క్రికెటర్లు బస చేస్తున్న హోటల్ లోని ఇద్దరు స్టాఫ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఇరుదేశాల బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. త్వరలోనే నూతన తేదీలతో షెడ్యూల్ విడుదల చేస్తామని స్పష్టం చేశాయి. ఇటీవలే రెండు జట్ల నుంచి ముగ్గురు కరోనా బారినపడ్డారు. సఫారీ గడ్డపై పర్యటనలో ఇంగ్లాండ్ అంతకుముందు టీ20 సిరీస్ నెగ్గింది.
Comments
Post a Comment