ICCపై మాజీ క్రికెటర్ అక్తర్ విమర్శలు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ విమర్శలు గుప్పించాడు. ఇటీవల ప్రకటించిన పలు డికేడ్ అవార్డుల్లో పాకిస్థాన్ ఆటగాళ్లకు చోటు దక్కకపోవడంపై మండిపడ్డాడు. టీ20 ర్యాంకుల్లో టాప్-2లో ఉన్న బాబర్ అజామ్ కు అవార్డుల్లో చోటులేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. IPL జట్టునే ప్రపంచ క్రికెట్ జట్టుగా ఐసీసీ ప్రకటించిందని విమర్శించాడు. 3 ఫార్మాట్ అవార్డుల్లో ఏ పాక్ క్రికెటర్ కు చోటు దక్కలేదు.
Comments
Post a Comment