హోటల్ విడిచి వెళ్లొద్దు
సిడ్నీలో బయోసెక్యూరిటీ ప్రొటోకాల్స్ పాటించేందుకు టీమిండియా మేనేజ్ మెంట్ అంగీకరించింది. సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్లేయర్లందరూ తాము బస చేస్తున్న హోటళ్లను విడిచి బయటకు వెళ్లొద్దని ఆదేశించింది. హోటల్ నుంచి మైదానానికి మైదానం నుంచి హోటల్ కు మాత్రమే వెళ్లాలని సూచించింది. భౌతిక దూరం పాటించాలంది. కాగా జనవరి 7 నుంచి సిడ్నీలో AUS-IND మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది.
Comments
Post a Comment