అందుకే IPL ఆడలేదు: రైనా
చెన్నై జట్టులో కరోనా కేసులు పెరగడంతో భారత్ మాజీ క్రికెటర్ సురేష్ రైనా స్వదేశానికి వచ్చేశాడని IPL సమయంలో పుకార్లోచ్చాయి. రూమ్ కేటాయించే విషయంలోనూ గొడవ పడినట్లు వదంతులొచ్చాయి. దీనిపై రైనా స్పందించాడు. 'పంజాబ్ లో ఓ సంఘటన జరిగింది. ఆ కఠిన సమయంలో నేను కుటుంబంతో ఉండాల్సిన అవసరం ఉంది. నా పిల్లల కోసం ప్రాధాన్యతనిచ్చా. అందుకే IPL ఆడలేకపోయా.' అని తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
Comments
Post a Comment