Posts

భారత్‌ అద్భుత విజయం

Image
టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంత్‌ (89*), సుందర్‌(22) చివర్లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 369 ఆలౌట్‌ భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 336 ఆలౌట్‌ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 294 ఆలౌట్‌ భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 329/7

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

Image
సిడ్నీ: ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి 5న ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపికకు వేళైంది. మంగళవారం కొత్త ఛైర్మన్‌ చేతన్‌శర్మ సారథ్యంలో జరిగే సెలక్షన్‌ కమిటీ సమావేశంలో జట్టును ప్రకటించనున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు భారత బృందాన్ని ఎంపిక చేయనున్నారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ముగిశాక పితృత్వ సెలవుపై స్వదేశానికి వచ్చేసిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు. గాయం కారణంగా ఆసీస్‌ వెళ్లలేకపోయిన వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌శర్మ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆడుతున్న ఇషాంత్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు. అతనితో పాటు ఆసీస్‌ సిరీస్‌లో గాయపడి కోలుకున్న బుమ్రా, అశ్విన్‌ తిరిగి జట్టులోకి రానున్నారు. గాయాలతో కంగారూలతో టెస్టు సిరీస్‌ మధ్యలో వైదొలిగిన షమి, జడేజా, ఉమేశ్‌ యాదవ్‌, హనుమ విహారి సెలక్షన్‌కు అందుబాటులో లేరు. శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌లను రిజర్వ్‌ పేసర్లుగా ఎంపిక చేసే అవకాశాలున్నాయి. జడేజాకు బదులు షాబాజ్‌ నదీమ్‌ను జట్టులోకి తీసుకు రావచ్చు. మిడిలార్డర్‌లో స్థానం కోసం కేఎ...

కేటీఆర్‌తో సిడ్నీ హీరో

Image
టీమ్‌ఇండియా టెస్టు జట్టు ఆటగాడు గాదె హనుమ విహారి సోమవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో మూడో టెస్టులో అద్భుత పోరాటంతో ప్రశంసలందుకున్న విహారి తొడ కండరాల గాయం కారణంగా చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అనంతరం స్వదేశానికి తిరిగొచ్చిన విహారి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. విహారితో పాటు భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు తరుణ్‌ కోన, శ్రీకృష్ణప్రియ, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. విహారి, తరుణ్‌, శ్రీకృష్ణప్రియలను సత్కరించిన కేటీఆర్‌.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

స్మిత్‌ చూస్తుండగానే రోహిత్‌ షాడో బ్యాటింగ్‌

Image
టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ గబ్బా పిచ్‌పై షాడో బ్యాటింగ్‌ చేశాడు. స్టీవ్‌స్మిత్‌ చూస్తుండగానే క్రీజులోకి వచ్చి ఫ్రంట్‌ఫుట్‌తో ఊహాత్మకంగా షాట్‌ ఆడాడు. ఆ తర్వాత నేరుగా అవతలి ఎండ్‌లోకి వెళ్లి స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేశాడు. ఉద్దేశపూర్వకంగా చేశాడో? ఊరికే చేశాడో? తెలియదు గానీ మొత్తానికి ఆ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. సిడ్నీలో టెస్టులో టీమ్‌ఇండియా వీరోచితంగా పోరాడిన సంగతి తెలిసిందే. ఆఖరి రోజు రిషభ్ పంత్‌ మెరుపులు మెరిపించాడు. అయితే విరామ సమయంలో స్టీవ్‌స్మిత్‌ క్రీజులోకి వచ్చి షాడో బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో అతడు పంత్‌ బ్యాటింగ్‌ గార్డ్‌ చెరిపివేసినట్టు వీడియోల్లో కనిపించింది. అతడు ఉద్దేశపూర్వకంగానే పంత్‌ గార్డ్‌మార్క్‌ చెరిపివేశాడని విమర్శలు వచ్చాయి. ఆసీస్‌ క్రికెటర్లు అప్పుడు స్మిత్‌కు అండగా నిలిచారు.‌ అప్పుడప్పుడు క్రీజులోకి వచ్చి బ్యాటింగ్‌ చేస్తున్నట్టుగా ఊహించుకుంటాడని టిమ్‌పైన్‌ సహా మరికొందరు తెలిపారు. ఇప్పుడు స్టీవ్‌స్మిత్‌ బ్యాటింగ్‌ చేస్తుండగానే రోహిత్‌ అలా చేయడం విస్మయపరిచింది. దీనిపై మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మాట్లాడాడు. దురుద్దేశపూర్వకంగా స్టీవ్‌స్మిత్‌ పిచ్‌ను ...

ఎలా ముగిస్తారో

Image
సి రీస్‌ ఫలితం ఎలా వచ్చినప్పటికీ విజయం మాత్రం భారత్‌దే’’.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో టీమ్‌ఇండియా పోరాట పటిమ చూసిన తర్వాత చాలా మంది మాజీ ఆటగాళ్లు వ్యక్తపరిచిన అభిప్రాయమిది. అవును..   బలమైన ఆసీస్‌తో టెస్టుల్లో భారత ఆటగాళ్లు చూపిస్తున్న పోరాటం అసమానం. గాయాల కారణంగా ప్రధాన ఆటగాళ్లు దూరమైనప్పటికీ.. ద్వితీయ శ్రేణి క్రికెటర్లతో కూడిన జట్టు ప్రదర్శిస్తున్న పట్టుదల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ పోరాటానికి సరైన ఫలితం దక్కేందుకు టీమ్‌ఇండియాకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. చివరి టెస్టు ఆఖరి రోజు అదే తెగువ, పట్టుదల చూపి సిరీస్‌ను సగర్వంగా ముగించాలని జట్టు కోరుకుంటోంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌కు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే సిరీస్‌ 1-1తో సమంగా ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా.. చివరగా బోర్డర్‌-గావస్కర్‌ (2018-19)  సిరీస్‌లో విజేతగా నిలిచిన భారత్‌ దగ్గరే ఆ ట్రోఫీ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌ నెగ్గకపోతే మాత్రం ఆసీస్‌ పరువు కచ్చితంగా పోతుంది. ఎందుకంటే గత 31 టెస్టుల్లో తమకు పరాజయం తెలీని గబ్బా మైదానంలో.. అత్యుత్తమ ఎలెవన్‌ అందుబాటులో లేని భారత్‌తో ...

ఆఖరి పోరాటం

Image
జట్టు నిండా గాయాలే. 11 మంది ఫిట్‌గా ఉన్న వాళ్లను సిద్ధం చేయడమే కష్టం ఉంది. దానికి తోడు క్వారంటైన్‌ కష్టాలు. ఆపై ఆడాల్సింది ఆస్ట్రేలియాకు అద్బుత రికార్డున్న గబ్బాలో. ఇన్ని ప్రతికూలాంశాలున్నా.. టీమ్‌ ఇండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. క్లిష్టపరిస్థితుల్లో సిడ్నీలో అసాధారణ పోరాటంతో చేసుకున్న డ్రా స్ఫూర్తినిస్తుంటే.. ఆతిథ్య జట్టుతో నిర్ణయాత్మక నాలుగో టెస్టుకు సన్నద్ధమైంది. రేపటి నుంచే సమరం. హో రాహోరీగా సాగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో రసవత్తర సమరానికి వేళైంది. శుక్రవారం నుంచే భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు. సిరీస్‌ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌పై చాలా ఆసక్తి ఏర్పడింది. గత మ్యాచ్‌ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత్‌ బరిలోకి దిగుతుంటే.. తమకు గొప్ప రికార్డున్న గబ్బాలో మరోసారి తమదే పైచేయి అవుతుందన్న ధీమాతో ఆతిథ్య జట్టు పోరుకు సిద్ధమైంది.  మరి సిరీస్‌ ఎవరి సొంతమవుతుందో..! పొంచి ఉన్న వాన ఎం తో ఆసక్తిరేపుతున్న ఈ చివరి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం, సోమవారం వాన పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే వాన వల్ల రోజంతా ఆట ఏమీ తుడిచిపెట్టుకుపోవచ్చు. గబ్బా పిచ్‌పై బౌలర్లక...

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

Image
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టులో ఒక ఆటగాడికి యూకే కరోనా స్ట్రెయిన్‌ సోకిందని అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో అతడిని ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించామని చెప్పారు. లంక జట్టుతో ఇంగ్లాండ్‌ నేటి నుంచి రెండు టెస్టుల సిరీస్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కన్నా ముందే ఈ సిరీస్‌ జరగాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. క్రికెట్‌ మళ్లీ మొదలయ్యాక నేటి నుంచి నిర్వహించడానికి ఇరు జట్లూ అంగీకరించాయి. ఈ క్రమంలోనే జనవరి 4న అక్కడ అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు కరోనా టెస్టులు చేశారు.  అందులో ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీకి పాజిటివ్‌గా తేలిందని, అది యూకే స్ట్రెయిన్‌గా గుర్తించామని లంక వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అయితే, శ్రీలంకలో ఇదే తొలి యూకే స్ట్రెయిన్‌ కేసు అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ వైరస్‌ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందన్న నేపథ్యంలో గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. అంతకుముందు మిగతా ఆటగాళ్లకి నెగెటివ్‌ రావడంతో నేటి నుంచి టెస్టు సిరీస్ యథావిధిగా కొనసాగుతందని చెప్పారు. మరోవైపు అలీతో సన్నిహితంగా ఉన్న క్రిస్‌వోక్స్‌కు నెగిటివ్‌ వచ్చిందని తెలిపారు. అయితే, వోక్స్‌ ...