భారత్ అద్భుత విజయం
టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంత్ (89*), సుందర్(22) చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 369 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్ : 336 ఆలౌట్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 294 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్ : 329/7