Posts

Showing posts from November, 2020

జెర్సీపై మూడు స్టార్స్ ఎందుకో తెలుసా

Image
టీమ్ ఇండియా కొత్త జెర్సీ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. జెర్సీ మీద BCCI లొగో పైనా ఉన్న మూడు నక్షత్రాలు ఎందుకు పెట్టారా అనే ప్రశ్న మొదలైంది. భారత్ ఇప్పటికీ మూడు ప్రపంచకట్లు సాధించినందుకు చిహ్నంగా ఆ 3 నక్షత్రాలను ముద్రించారు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. అలాంటి జట్టులో భాగం కావడం తనకు దక్కిన గౌరవమన్నాడు. భారత్ 1983, 2011లో వన్డే ప్రపంచకప్, 2007లో T20 వరల్డ్ కప్ గెలుచుకుంది.

టీమిండియా చెత్త రికార్డు

Image
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. వరుసగా 3 మ్యాచ్ ల్లో ప్రత్యర్థి ఓపెనర్లు IND సెంచరీకి పైగా భాగస్వామ్యం నెలకొల్పడం వన్డే చరిత్రలో ఇదే తొలిసారి. ఆసీస్ రెండు వన్డేల్లో తొలి వికెట్ కు 156, 142 పరుగుల పార్టనర్‌షిప్ నమోదు చేసింది. దీనికి ముందు టీమిండియా... న్యూజిలాండ్ తో చివరి వన్డే ఆడగా ఈ మ్యాచ్ లోనూ కివీస్ ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.

మైదానంలో లవ్ ప్రపోజల్

Image
సిడ్నీలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత అభిమాని, ఆస్ట్రేలియా అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాడు. రింగ్ అందించగా, దాన్ని ఆమె తీసుకుని అతడి ప్రేమను అంగీకరించింది. ప్రేమికులిద్దరూ హగ్ చేసుకుని, ముద్దు పెట్టుకున్నారు. దీంతో మైదానమంతా ఒక్కసారిగా చప్పట్ల మోత మోగింది. కామెంటేటర్లు ఫిల్డింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆ జంటకు కంగ్రాట్స్ చెప్పారు.

బాబర్ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు

Image
పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ ఆజమ్ తనని మోసం చేశాడంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పదేళ్ల పాటు లైంగికంగా అనుభవించాడని ఆరోపించింది. క్రికెట్లో సంబంధం లేని రోజుల నుంచి బాబర్ తనకు తెలుసని చెప్పింది. 2010లో తనని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని, తాను అంగీకరించానని తెలిపింది. అయితే ఆ తర్వాత బాబర్ కి క్రికెట్లో ఫేమ్ రావడంతో తన మనసు మార్చుకున్నాడని చెప్పింది.

22 వేల రన్స్ పూర్తి చేసుకున్న విరాట్

Image
ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో కెప్టెన్ కోహ్లి కీలక సమయంలో ఔటయ్యాడు. సెంచరీ చేస్తాడని భావించగా నిరాశపరిచాడు. 89 పరుగుల వద్ద హేజిల్‌వుడ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. గత 2 మ్యాచుల్లో కోహ్లి హేజిల్‌వుడ్ బౌలింగ్ లోనే ఔటవ్వడం విశేషం. ఈ మ్యాచులో విరాట్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 22 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలి: క్లార్క్

Image
AUSతో మొదటి టెస్టు తర్వాత కోహ్లి ఇండియాకు రానున్నాడు. మిగిలిన మ్యాచ్ లకు రోహిత్ శర్మను సారథిగా ఎంపిక చేయాలని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. 'నేను వంద శాతం రోహిత్ నే ఎంచుకుంటా. రోహిత్ నాయకత్వ లక్షణాలు అద్భుతం. టీంను ఎలా నడిపించాలో అతడికి తెలుసు. గాయం నుంచి కోలుకుని రాగానే రోహిత్ కెప్టెన్సీ తీసుకోవాలి' అని చెప్పాడు. కాగా గాయంతో తొలి 2 టెస్టులకు రోహిత్ దూరం కానున్నాడు.

చేజారిన సిరీస్

Image
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కంగారు జట్టు 389/4 భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో భారత్ 338/9 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బ్యాట్స్ మన్లలో విరాట్ (89), రాహుల్(76) రాణించారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది.

అత్యంత బిజీ ప్లేయర్ విరాట్

Image
టీమిండియా కెప్టెన్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ దశాబ్దం (జనవరి 1, 2010 నుంచి డిసెంబర్ 31 2019)లో అత్యధిక రోజులు అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కోహ్లి అన్ని ఫార్మాట్లు కలిపి మొత్తం 668 రోజులు క్రికెట్ ఆడాడు విరాట్ తర్వాత మాథ్యూస్ (608), బ్రాడ్ (593), టేలర్ (571), జో రూట్ (568), ఆమ్లా, కుక్, విలియమ్సన్ వార్నర్ ఉన్నారు. ఇండియా నుంచి అశ్విన్ 453 రోజులు ఆడాడు.

T20 రికార్డ్: గ్లెన్ ఫిలిప్స్ ఫాస్టెస్ట్ సెంచరీ

Image
వెస్టిండీతో న్యూజీలాండ్ కు జరిగిన రెండో T20లో రికార్డులు బద్దలయ్యాయి. గ్లెన్ ఫిలిప్స్ T20ల్లో తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టిన కివీస్ ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. గ్లెన్ 46 బాల్స్ లో వంద పరుగులు బాదాడు. దీంతో NZ స్కోర్ 20 ఓవర్లలో 238కి చేరుకుంది. T20 మ్యాచుల్లో ఆ దేశానికి ఇది మూడో అత్యధిక స్కోరు. గ్లెన్ కంటే ముందు T20ల్లో కివీస్ ఆటగాళ్ల ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మున్రో (46 బంతులు) పేరిట ఉంది.

స్మిత్ అరుదైన రికార్డు

Image
టీమిండియాపై ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో భారత్ పై 5 కంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో ఆసీస్ ఆటగాడిగా ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ 6 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే పాంటింగ్ కు 6 సెంచరీలు చేయడానికి 59 మ్యాలు అవసరం కాగా.. స్మిత్ కేవలం 20 వన్డేల్లోనే ఈ ఫీట్ (5 సెంచరీలు) సాధించాడు.

చరిత్రలో రెండో రికార్డు

Image
భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా అరుదైన ఘనత అందుకుంది. ఆ జట్టుకు చెందిన టాప్-5 బ్యా ట్స్ మెన్ (వార్నర్, ఫించ్, స్మిత్, లబుషేన్, మ్యాక్స్ వెల్) 50+ పరుగులు చేశారు. గతంలో ఇండియాతో 2013లో జైపూర్ లో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు ఈ రికార్డు నమోదు చేయగా. తాజాగా రెండో సారి రికార్డు నమోదు చేశారు. అటు ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేసిన 389/4 పరుగులు కూడా భారత్ పై అత్యధిక స్కో రే.

విండీస్ పై న్యూజిలాండ్ విజయం

Image
వెస్టిండీస్ పై న్యూజిలాండ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. తొలుత WI బ్యాటింగ్ కు రాగా 10ఓవర్ల తర్వాత వర్షం పడింది. దీంతో మ్యాచ్ ను 16 ఓవర్లకు కుదించారు. కెప్టెన్ పొలార్డ్ 37 బంతుల్లో 8 సిక్సర్లతో 75* రన్స్ చేయడంతో WI 180 పరుగులు చేసింది. ఫెర్గూసన్ 5 వికెట్లు తీశాడు. NZ టార్గెట్ 16ఓవర్లలో 176గా నిర్ణయించారు. నీషమ్ (48*), కాన్వే (41) రాణించడంతో 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఐదుగురితో ఎప్పుడైనా కష్టమే: పాండ్యా

Image
ఐదుగురు బౌలర్లతో ఆడి గెలవడం ఎప్పుడైనా కష్టంగానే ఉంటుందని భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా అభిప్రాయపడ్డాడు. 'జట్టుకు ఒక్కరే విజయాన్ని అందించలేరు. ఒక్కరితో ఎక్కువగా ప్రణాళికలు వేయలేం. ఇక ఐదుగురి బౌలర్లతో ఆడితే ఎప్పుడైనా కష్టమే. ఒకరు సరిగ్గా వేయకపోయినా ఆ భారం మరొకరిపై పడుతుంది. అందుకే ఆల్రౌండర్ ఉంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది' అని వివరించాడు. ఇవాల్టి మ్యాచులో ఆరో బౌలర్ లేకపోవడం టీమిండియాకు నష్టం చేసింది. గాయం కారణంగా చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదు. అయితే తాను బౌలింగ్ పై దృష్టి పెట్టానని, సరైన సమయంలో ముందుకు వస్తానని పాండ్యా చెప్పాడు. భవిష్యత్ లో టీ20 ప్రపంచకప్ ఉందని.. అందుకు తగ్గట్లుగా ప్రిపేర్ అవుతున్నట్లు తెలిపాడు. ఇటీవల జరిగిన IPLలోనూ పాండ్యా ఒక్క ఓవర్ కూడా వేయలేదు.

తొలి వన్డేలో TRS ప్రచారం

Image
సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డేలో TRS నేతలు ప్రచారం నిర్వహించారు. ఆస్ట్రేలియా TRS విభాగం ప్రతినిధులు TRS ప్లకార్డులను పట్టుకుని GHMC ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.

డిసెంబర్ 11న రోహిత్ కు ఫిట్నెస్ పరీక్ష

Image
భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మకు డిసెంబర్ 11న ఫిట్ నెస్ పరీక్ష నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి  జై షా తెలిపారు. 'UAEలో ఐపీఎల్ ముగిసిన తర్వాత అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసేందుకు రోహిత్ ముంబై చేరుకున్నాడు. తండ్రి పరిస్థితి మెరుగవ్వడంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వచ్చాడు డిసెంబర్ 11న ఫిట్నెస్ పరీక్షలో పాసైతే రోహిత్ ఆస్ట్రేలియా వెళ్తాడు' అని షా పేర్కొన్నారు.

7వ క్రికెటర్ కు కరోనా

Image
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది ఇప్పటికే ఆరుగురు క్రికెటర్లకు కరోనా సోకగా.. తాజాగా మరోకరికి కరోనా వచ్చింది. దీంతో 2 వారాల పాటు పాక్ జట్టుకు చెందిన ఏడుగురు క్రికెటర్లను క్వారంటైన్ లో ఉంచనున్నారు. పాక్ క్రికెటర్లు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు న్యూజిలాండ్ అధికారులు తెలిపారు ఈ నెల 24 న్యూజిలాండ్ లో అడుగుపెట్టిన పాక్ జట్టు. వచ్చే నెల 18 నుంచి మూడు T20లు, రెండు టెస్టులు ఆడనుంది.

రోహిత్ శర్మ, కోహ్లి మధ్య మాటల్లేవ్

Image
రోహిత్ శర్మ గాయంపై తనకు స్పష్టత లేదని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ నెహ్రా స్పందించాడు. 'రోహిత్ శర్మ, కోహ్లి మధ్య మాటల్లేవని తెలుస్తోంది. కోహ్లీ అయినా రోహిత్తో మాట్లాడాలి. రోహిత్ అయినా విరాట్తో మాట్లాడాలి IPL సమయంలోనైనా సెలక్టర్లు, రవిశాస్త్రి, కోహ్లి, రోహిత్ మాట్లాడుకుని ఉండాల్సింది. ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా మాట్లాడుకోలేకపోతే ఎలా?' అని నెహ్రా అన్నాడు.

ఫీల్డింగ్ విభాగం చేతులెత్తేసింది

Image
శుక్రవారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఫీల్డర్లు చేతులెత్తేశారని స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్లలో ప్రతి క్యాచ్ కీలకమని, కానీ ఈ మ్యాచ్ లో ఫీల్డర్లు కొన్ని క్యాచులు వదిలేశారని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ ఫలితంగానే ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయడంతో టీమిండియాకు ఛేజింగ్ కష్టమైందని పేర్కొన్నాడు.

రాహుల్ కు క్షమాపణలు చెప్పా: మ్యాక్స్ వెల్

Image
టీమిండియాతో నిన్న జరిగిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్ కు క్షమాపణలు చెప్పినట్లు మ్యాక్స్ వెల్ అన్నాడు ఇటీవల ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్న KXIP తరపున ఆడిన మ్యాక్స్ వెల్.. పూర్తిగా విఫలం అయ్యాడు. కానీ నిన్న మాత్రం భారత్ పై మెరుపు బ్యాటింగ్ చేశాడు దీంతో మ్యాక్సీని ట్యాగ్ చేస్తూ జేమ్స్ నీషమ్ మీమ్ షేర్ చేయగా.. తాను రాహుల్ కు క్షమాపణలు చెప్పినట్లు మ్యాక్స్ వెల్ రిప్లై ఇచ్చాడు.

టీమిండియా ఆటగాళ్లకు జరిమానా

Image
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా ఆటగాళ్లకు ICC జరిమానా విధించింది. ICC నిబంధనల ప్రకారం ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 20% కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి కెప్టెన్ కోహ్లి సైతం అంగీకరించాడని తెలిపింది. ఇక ఆస్ట్రేలియా కేటాయించిన సమయంలో ఓవర్లు పూర్తి చేసిందని పేర్కొంది. నిన్న సిడ్నీలో జరిగిన మ్యాచులో INDపై ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కూతురే అదృష్టం తెచ్చింది

Image
కూతురు పుట్టాక యార్కర్ కింగ్ నటరాజన్ తలరాత మారింది. AUS పర్యటనకు ఎంపిక చేసిన టీ20, వన్డే, టెస్టు జట్టులో నటరాజన్ పేరు లేదు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడటంతో అనూహ్యంగా నటరాజనన్ను టీ20ల కోసం ఎంపిక చేశారు. ఇక తాజాగా నవదీప్ సైనీ గాయంతో ఇబ్బంది పడటంతో వన్డే జట్టులోనూ చోటు దక్కింది. కూతురు పుట్టాక టీమిండియాకు ఆడే అవకాశం వచ్చిందన్న నటరాజన్ తాజాగా వన్డేల్లోనూ ప్లేస్ సాధించడంతో హ్యాపీగా ఫీలవుతున్నాడు.

రోహిత్ శర్మ లేకుంటే అంతే

Image
ఓపెనర్ రోహిత్ శర్మ లేనందుకే AUSతో తొలి వన్డేలో టీమిండియా ఓడిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్ లో #Rohitsharma హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. భారీ లక్ష్య ఛేదనలో హిట్ మ్యాన్ కు మంచి అనుభవం ఉందని, ముఖ్యంగా AUSపై మంచి రికార్డు ఉందని ట్వీట్లు చేస్తున్నారు వైస్ కెప్టెన్ గానూ ఫీల్డ్ లో కోహ్లికి సలహాలు ఇచ్చేవాడని.. రోహిత్ శర్మ లేకుంటే కోహ్లి కెప్టెన్సీ ఇది! అంటూ సెటైర్లు వేస్తున్నారు.

సిడ్నీ వన్డేలో చాహల్ చెత్త రికార్డు

Image
ఆస్ట్రేలియాతో ఇవాళ జరిగిన తొలి వన్డేలో యజువేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. 10 ఓవర్లు వేసి ఓ వికెట్ తీసిన చాహల్ 89 పరుగులిచ్చాడు. వన్డే క్రికెట్లో ఓ భారత స్పిన్నర్ ఇన్ని పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. కాగా చాహల్ బౌలింగ్ లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ భారీగా పరుగులు చేశారు. కాగా టీమిండియా తరపున వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన బౌలర్ భువనేశ్వర్. 2015లో SAపై 106 రన్స్ ఇచ్చాడు.

ఓటమిపై విరాట్ వివరణ

Image
AUSతో ఓటమిపై కెప్టెన్ విరాట్ కోహ్లి వివరణ ఇచ్చాడు. ఇటీవల T20 మ్యాచులు ఆడినప్పటికీ చాలా రోజుల తర్వాత వన్డే ఆడటం కొద్దిగా ఎఫెక్ట్ చూపింది. 25 ఓవర్ల తర్వాత మా బాడీ లాంగ్వేజ్ సరిగా లేదు. బలమైన ప్రత్యర్థిపై పట్టు విడిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు దురదృష్టవశాత్తు హార్డిక్ పాండ్యా బౌలింగ్ చేసేందుకు ఫిట్ గా లేడు. స్టాయినిస్, మ్యాక్స్ వెల్ లాగా మాకు మరో ఆల్రొండర్ లేడు' అని కోహ్లి చెప్పాడు.

ఆస్ట్రేలియా విజయం

Image
INDతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 308/8 పరుగులు చేయగల్గింది. దీంతో AUS 66 పరుగుల తేడాతో నెగ్గింది. టాపార్డర్ విఫలమైనా శిఖర్ ధావన్ (74), హార్దిక్ పాండ్యా (90) రాణించారు. ఆసీస్ బౌలర్లలో జంపా 4, హేజిల్వుడ్ 3, స్టార్క్ ఒక వికెట్ తీశారు. అంతకు ముందు ఫించ్, స్మిత్ సెంచరీలు చేయడంతో AUS 374/6 రన్స్ చేసింది.

పవన్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు

Image
GHMC ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చి పోటీ నుంచి తప్పుకోవడం పట్ల నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో విమర్శలు గుప్పించారు. 'పవన్ నిర్ణయం నిరాశపర్చింది. మీరు లీడర్. ఇంకో పార్టీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? 2014లో NDA తో పొత్తు పెట్టుకుని మోదీని పొగిడారు. 2019లో లెఫ్ట్ పార్టీలతో జతకట్టి మోదీని తిట్టారు. మీరు ఇన్ని సార్లు మారుతున్నారంటే ఊసరవెల్లి అయి ఉండాలి' అని సెటైర్లు వేశారు.

ఒకే ఓవర్లో 11 బంతులు

Image
INDతో జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చెత్త బౌలింగ్ వేశాడు. ఒక్క ఓవర్ పూర్తి చేయడానికి ఏకంగా 11 బాల్స్ వేశాడు. రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 6 లీగల్ బాల్స్, 4 వైడ్లు, 1 నో బాల్ వేశాడు. వైడ్, నో బాల్ కు బౌండరీలు కూడా వచ్చాయి దీంతో మొత్తంగా స్టార్క్ ఆ ఓవర్లో 20 పరుగులు సమర్పించుకున్నాడు. సరైన ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగడంతోనే స్టార్క్ లయ తప్పినట్లు తెలుస్తోంది.

శబరిమలలో 39 మందికి కరోనా

Image
శబరిమల ఆలయంలో కరోనా కలకలం రేగింది పోలీసులు, ఉద్యోగులు, భక్తులు సహా మొత్తం 39 మందికి కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 27 మంది ఉద్యోగులు, ఇద్దరు పోలీసులు ఉన్నారు. వీరికి శబరిమలలోని సన్నిధానం పంబా, నీలక్కల్ క్యాంపుల్లో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. కాగా ఈ నెల 16 నుంచి 10-60 ఏళ్ల మధ్య వయసున్న వారినే ఆలయంలోకి అనుమతిస్తున్నారు డిసెంబర్ 26న మండల పూజ జరగనుంది.

అలా చేస్తే వైట్ హౌజ్ ఖాళీ చేస్తా: ట్రంప్

Image
జో బైడెన్ గెలిచినట్లు ఎలక్టోరల్ కాలేజీ నిర్ణయిస్తే శ్వేతసౌధం ఖాళీ చేస్తానని US ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. కానీ ఈ విధంగా చేస్తే పెద్ద పొరపాటు అవుతుందని పేర్కొన్నారు. జనవరి 20 లోపల భారీ మోసం బయటపడుతుందని చెప్పుకొచ్చారు అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మరోసారి గళమెత్తారు. ఓటింగ్ సదుపాయాల్లో మూడో స్థానంలో ఉన్న US.. హ్యాకింగ్ కి వీలుగల కంప్యూటర్ పరికరాలు వినియోగిస్తోందని ట్రంప్ ఆరోపించారు.

సోషల్ మీడియాకు బానిస కాకుండా ఉండాలంటే ఏం చేయాలి

Image
సోషల్ మీడియా కూడా ఒక రకం డ్రగ్స్ లాంటిదే. దీనికి బానిస కావడం వల్ల ఎలాంటి హాని ఉండదని మొదట అనిపించవచ్చు. కానీ అది ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది. సోషల్ మీడియా అతిగా వాడటం వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. సోషల్ మీడియా వాడకాన్ని ఎలా తగ్గించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎంతసేపు వాడుతున్నారో తెలుసుకోండి సగటున ఒక వ్యక్తి రోజులో 4 గంటలు మొబైల్ ను వాడుతున్నాడు. మీ ఫోన్లో ట్రాకర్ ఉపయోగించడం వల్ల రోజులో ఎంత సేపు మొబైల్ తో గడుపుతున్నారో మీరు తెలుసుకోవచ్చు. సోషల్ మీడియాకు హాలిడే ఇవ్వండి వారానికి ఒకటి లేదా రెండు రోజులు సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయకుండా ఉండేందుకు ప్రయత్నించండి. నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి నోటిఫికేషన్ రావడం వల్ల మొబైల్ లో సౌండ్, బజ్ లేదా ఫ్లాష్ వస్తూ ఉంటాయి దాని వల్ల మనం సులభంగా ఫోన్ ఓపెన్ చేసేందుకు ఆకర్షితులవుతాం. కాబట్టి పుష్ నోటిఫికేషన్లు రాకుండా ఆఫ్ చేసుకుంటే మీరు ఈజీగా సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకోగల్గుతారు. దూరం పాటించండి రోజులో ఎన్ని గంటలు ఫోన్ లేకుండా ఉండగలరో ప్లాన్ చేసుకోండి ఉదాహరణకు ఉదయం, డిన్నర్ చేసే సమయంలో. అలాగే బెడ్రూం ...

అందుకే నల్ల బ్యాండ్లు ధరించారు

Image
సిడ్నీలో నేడు జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నలుపు రంగు బ్యాండ్లు ధరించారు. మాజీ ఆస్ట్రేలియా ప్లేయర్ డీన్ జోన్స్, ఫిలిప్ హ్యూస్ ల మృతిపై సంతాపం ప్రకటిస్తూ నల్ల బ్యాండ్లు ధరించారు. 59 ఏళ్ల డీన్ జోన్స్ గత సెప్టెంబర్ లో కన్నుమూశారు. 6 ఏళ్ల క్రితం ఫిలిప్ ఇదే రోజున తలకు బాల్ తగిలిన కారణంతో చనిపోయాడు. వీరి మృతికి నివాళి చిహ్నంగా ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

269 రోజుల తర్వాత.. మళ్లీ ఇవాళే

Image
మార్చి 2న చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత జట్టు... 269 రోజుల గ్యాప్ తో మళ్లీ ఇవాళ మ్యాచ్ ఆడనుంది. కరోనాతో క్రికెట్ ఆగిపోగా.. ఇటీవల IPLలో భారత క్రికెటర్లు మళ్లీ బ్యాట్, బంతి పట్టారు. ఆస్ట్రేలియాతో భారత్ ఇవాళ తొలి వన్డే ఆడనుండగా.. ఉ. 9.10 నుంచి మ్యాచ్ ప్రారంభం అవ్వినది. AUSతో దాని సొంతగడ్డపై IND ఇప్పటివరకు 51 వన్డేలు ఆడగా.. 36 మ్యాచ్ల్లో ఓడి, 13 మ్యాచ్ల్లో గెలవగా, 2 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.

రూ.500 బిల్లుకు రూ.2.21లక్షల టిప్

Image
USలోని క్లీవ్ లాండ్ లో రెస్టారెంట్ కు ఓ కస్టమర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. 7 డాలర్ల (దాదాపు రూ.500)బిల్లుకు 3వేల డాలర్లు(సుమారు రూ.2.21 లక్షలు) టిప్ తో మొత్తం 3,007 డాలర్లు చెల్లించి ఆశ్చర్యపరిచాడు ఈ విషయాన్ని రెస్టారెంట్ యజమాని బ్రెండన్ షేర్ చేయడంతో వైరలైంది. మొదట పొరపాటుగా చెల్లించాడని అనుకున్నారట. 'తెలిసే ఇచ్చాను పంచుకోండి. మెర్రీ క్రిస్మస్' అంటూ కస్టమర్ వెళ్లిపోయాడని చెప్తూ ఓనర్ బ్రెండన్ ఆనందపడ్డాడు.

నటరాజన్ ఇన్, ఇషాంత్ ఔట్

Image
ఆస్ట్రేలియాతో జరగబోయే 3 మ్యాచుల వన్డే సిరీస్ జాబితాలో పేసర్ నటరాజన్ ను చేర్చినట్లు బీసీసీఐ పేర్కొంది. నవదీప్ సైనీకి వీపుభాగంలో నొప్పి ఉండటంతో నటరాజన్ ను ప్రత్యామ్నాయంగా ప్రాబబుల్స్ లోకి తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి ఫిట్ నెస్ పొందని కారణంగా పేస్ బౌలర్ ఇషాంత్ ను టెస్ట్ సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు BCCI పేర్కొంది. రోహిత్ శర్మ గాయం గురించి డిసెంబర్ 11న స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

రాఖీ భాయ్ వచ్చేశాడు

Image
యశ్ హీరోగా భారీ అంచనాలతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం KGF2. ఇటీవల తిరిగి ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ కోసం యశ్ హైదరాబాద్ కు వచ్చాడు. చిత్రీకరణ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేశారు. KGF2 షూటింగ్ చివరి షెడ్యూల్ ఈరోజు ప్రారంభమవ్వగా.. DEC చివరి నాటికి పూర్తికానుంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ అధీరా పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా త్వరలో చిత్రయూనిట్తో కలవనున్నాడు.

హీరోయిన్ ఉండదా?

Image
మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా తర్వాత లూసిఫర్' తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. ఈ రీమేక్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. అటు ఈ సినిమా దర్శకుడు ఎవరు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మాస్ డైరెక్టర్ వినాయక్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అవన్నీ అబద్ధాలే: రకుల్ టీమ్

Image
వివాదాల కారణంగా కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలను రకుల్ ప్రీత్ సింగ్ టీమ్ ఖండించింది. ప్రస్తుతం ఆమె నితిన్ 'చెక్' లో, క్రిష్ మూవీలో, తమిళంలో శివకార్తికేయన్ కు జోడిగా నటిస్తోందని తెలిపింది. ఇక బాలీవుడ్ లో జాన్ అబ్రహం 'అటాక్' తో పాటు అర్జున్ కపూర్ మూవీలో కన్పించనుందని వెల్లడించింది. అటు అజయ్ దేవగణ్, అమితాబ్ నటించే 'మేడే'లోనూ నటించనుందని తెలిపింది.

వకీల్ సాబ్' కోసం కెమెరా ముందుకు: శృతి

Image
వకీల్ సాబ్ కోసం వచ్చే నెల నుంచే కెమెరా ముందుకు వస్తున్నట్లు నటి శృతిహాసన్ తెలిపింది. పింక్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ హీరోగా నటిస్తుండగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది వకీల్ సాబ్లో ఎవరు కథానాయికగా నటిస్తున్నారన్న సంగతి అధికారికంగా బయటకు రానప్పటికీ.. శృతి ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటిస్తూ తాను నటిస్తున్న విషయాన్ని ఖరారు చేసింది.

మేం పంది మాంసం తింటాం,రెండు పెగ్గులు వైన్ తగుతాం: రష్మిక

Image
రాంచరణ్ భార్య ఉపాసన 'యువర్ లైఫ్' కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక తన ఆహారపు అలవాట్ల గురించి పంచుకుంది. తాను కోర్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయినని, పంది మాంసం తింటామని చెప్పింది. పంది మాంసం మా సంప్రదాయ వంటకం. నిప్పులపై కాల్చి తింటాం. ఇంట్లోనే వైన్ తయారుచేసుకుంటాం. కోర్గి వాళ్లు రాత్రి పడుకునే ముందు రెండు పెగ్ ల వైన్ తాగుతారు. నిద్ర బాగా పడుతుంది. గుండెకు మంచిది' అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

లవ్ మ్యారేజ్ చేసుకున్న స్టార్ రెజ్లర్లు

Image
ప్రముఖ రెజ్లర్లు బజ్ రంగ్ పునియా, సంగీత ఫోగాట్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇరువురి కుటుంబాల సమక్షంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. పునియా, సంగీత గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు జాతీయ శిక్షణా శిబిరంలో మొదలైన వీరి లవ్ పెళ్లి పీటలెక్కింది. గీత, సంగీతలను అంతర్జాతీయ రెజ్ఞర్లుగా తీర్చిదిద్దిన తండ్రి మహావీర్ సింగ్ జీవితా కథాంశంతో దంగల్' మూవీ తెరకెక్కింది. వీరిద్దరికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

రోహిత్ గాయంపై క్లారిటీ లేదు: కోహ్లీ

Image
రోహిత్ శర్మ గాయం పరిస్థితిపై గందరగోళం నెలకొందని, దానిపై ఎలాంటి స్పష్టత లేదని విరాట్ కోహ్లీ అన్నాడు రోహిత్, ఇషాంత్ పూర్తిగా కోలుకుంటే ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడొచ్చని చెప్పాడు. 'రోహిత్ IPL ఆడాడు కాబట్టి AUS ఫ్లైట్ ఎక్కుతాడని అందరం భావించాం. కానీ అతనెందుకు మాతో రాలేదో తెలీదు. రోహిత్ NCAకు వెళ్లాడని తర్వాత తెలిసింది. సాహాకు గాయమైనా కోలుకుంటున్నాడు. రోహిత్ కోలుకుంటే టెస్టు ఆడొచ్చు' అని చెప్పాడు.

133 పరుగుల దూరంలో..

Image
ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి టీమిండియా సిరీస్ ప్రారంభం కానుండగా కోహ్లి ముందు ఓ రికార్డు ఉంది ఈ సిరీస్లో 133 పరుగులు సాధిస్తే.. 12వేల పరుగులు పూర్తి చేసిన ఆరో క్రికెటర్ గా నిలుస్తాడు. ఇక 300 కంటే తక్కువ మ్యాచుల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా కోహ్లి ఉంటాడు. 239 మ్యాచుల్లో 11,867 పరుగులను కోహ్లి సాధించాడు. ఇందులో 43 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలున్నాయి.

ఆరుగురు క్రికెటర్లకు కరోనా

Image
క్రికెట్లో మరోసారి కరోనా కలకలం రేగింది న్యూజిలాండ్ టూర్ కు వెళ్లిన ఆరుగురు PAK క్రికెటర్లకు పాజిటివ్ నిర్ధారణ అయింది. పాక్ జుట్టు ప్రస్తుతం క్రైస్ట్ చర్చ్ లో ఐసోలేషన్లో ఉందని కివీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. పాజిటివ్ వచ్చిన క్రికెటర్లను క్వారంటైన్ కు తరలించారు. ఈ టూర్లో పాక్. NZతో 3 T20లు రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. అయితే క్రికెటర్లకు కరోనా సోకడంతో సిరీస్ పై అనుమానాలు నెలకొన్నాయి.

విరాట్ కంటే రోహిత్ కెప్టెన్సీ బాగుంటుంది

Image
వన్డేలు, T20లకు IND కెప్టెన్ ను మార్చాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో కీపర్ పార్థివ్ పటేల్ స్పందించాడు 'IPLలో రోహిత్, విరాట్ నాయకత్వంలో ఆడాను. విరాట్ కంటే రోహిత్ కెప్టెన్సీ బాగుంటుంది. మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. జట్టును నిర్మించడంలో హిట్ మ్యాన్ ఎంతో పరిణితి సాధించాడు. ఒత్తిడిలో రోహిత్ సొంతంగా, వేగంగా నిర్ణయాలు తీసుకుంటే. కోహ్లి ఇతర ప్లేయర్లపై అతిగా ఆధారపడతాడు' అని పార్థివ్ చెప్పాడు.

స్మిత్ తో ఆ తప్పు చేయించాలి: సచిన్

Image
ఆస్ట్రేలియా బాట్స్ మన్ స్టీవ్ స్మిత్ కు అసాధారణమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉందని, అతడిని అవుట్ చేయాలంటే ఐదో స్టంప్ ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయాలని సచిన్ సూచించాడు. 'స్మిత్ బంతిని వేయకముందే తన స్థానం నుంచి దూరం జరిగి బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడు 4, 5 స్టంపుల మీద బంతుల్ని వేసి అతడిని కట్టడి చేయాలి. అతడిని బ్యాక్ ఫుట్ తో ఎక్కువగా ఆడే విధంగా చేసి అతడితో తప్పులు చేయించాలి' అని పేర్కొన్నాడు.

22సార్లు టెస్టులు చేయించుకున్నా: గంగూలీ

Image
గత నాలుగున్నర నెలల కాలంలో తాను 22 సార్లు కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నట్లు BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. '22సార్లు టెస్ట్ చేయించుకున్నాను, ఒక్కసారి కూడా పాజిటివ్ రాలేదు చుట్టూ పాజిటివ్ కేసులు ఉండటం వల్ల టెస్టులు చేయించుకోవాల్సివచ్చింది. నా కోసం మాత్రమే కాదు. దాన్ని మరొకరికి వ్యాప్తి చేయాలనుకోలేదు. అందుకే తరచుగా టెస్టులు చేయించా' అని పేర్కొన్నాడు.

T20 ఆడనున్న శ్రీశాంత్

Image
కేరళ క్రికెట్ సంఘం నిర్వహించే స్థానిక T20 టోర్నీలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆడనున్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ స్పీడ్ స్టర్ బంతి పట్టనున్నాడు. IPLలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో BCCI శ్రీశాంత్ పై శాశ్వత నిషేధం విధించింది. దీనిపై న్యాయపోరాటం చేసి సుప్రీం కోర్టులో విజయం సాధించాడు. సెప్టెంబర్ లో అతడిపై నిషేధం తొలగిపోయింది. దాంతో అళపులలో జరగబోయే T20 టోర్నీలో ఆడేందుకు శ్రీశాంత్ సిద్ధమయ్యాడు.

IPLలో ఇప్పటివరకు ఏ టీం ఎంత ఖర్చు చేసిందంటే ?

 1.బెంగళూరు - రూ.738 కోట్లు 2.ముంబై ఇండియన్స్ - రూ.713.4 కోట్లు 3. కోల్ కతా- రూ.686.9 కోట్లు 4.ఢిల్లీ క్యాపిటల్స్- రూ.657.9 కోట్లు 5.పంజాబ్- రూ.627.5 కోట్లు 6.చెన్నై - రూ.591.9 కోట్లు 7.హైదరాబాద్- రూ.477.8 కోట్లు 8.రాజస్థాన్- రూ.452.9 కోట్లు